రాంచీ: అయోధ్యలో జరిగే రామాలయం(Ayodhya Ram Mandir ) ఓపెనింగ్కు ఆహ్వానం వస్తే వెళ్తానని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తెలిపారు. ఇప్పటి వరకు తనకు ఆ ఈవెంట్కు చెందిన ఇన్విటేషన్ అందలేదన్నారు. రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందలేదని, ఒకవేళ ఆహ్వానం వస్తే అప్పుడు కచ్చితంగా వెళ్లనున్నట్లు సోరెన్ తెలిపారు. జేఎఎం నేతృత్వంలోని సర్కార్కు నాలుగేళ్లు ముగిసిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు. తాను మతపరమైన వ్యక్తిని అని, ఆలయాలు, గురుద్వారాలను విజిట్ చేస్తుంటానని చెప్పారు. జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నాటి నుంచి ప్రతిపక్ష తమను దెబ్బతీసే ప్రయత్నం చేస్తోందన్నారు. తాము గిరిజనులమే కానీ ఫూల్స్ కాదు అని ఆయన అన్నారు. ప్రతిపక్షాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలుసన్నారు.