కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ
లక్నో: అమేథీ నుంచి పోటీ చేసే నిర్ణయాన్ని పార్టీకే వదిలేసినట్టు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ మేరకు మీడియా అడిగిన ప్రశ్నకు రాహుల్ గాంధీ బదులిస్తూ.. ‘మా పార్టీలో అభ్యర్థుల ఎంపికపై నిర్ణయాలు పార్టీ ఎన్నికల కమిటీ తీసుకుంటుంది. దాని ఆదేశాలు ఏవైనా నేను పాటిస్తా’ అని పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని, బీజేపీ 150 సీట్లకే పరిమితం అవుతుందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.