బెంగళూరు: సామాజిక మాధ్యమాల పట్ల అతిగా ఆకర్షితులవుతుండటం తీవ్ర సమస్యలకు దారి తీస్తున్నది. కర్ణాటకలోని చామరాజనగరలో ఓ వ్యక్తి మరణానికి ఇది కారణమైంది. పోలీసుల కథనం ప్రకారం, కుమార్ (34) కూలి పనులు చేస్తూ జీవిస్తున్నారు.
ఆయన భార్య నిరంతరం ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ, అప్లోడ్ చేస్తుండేవారు. ఇన్స్టాగ్రామ్ను అతిగా చూడటంపై భర్త అభ్యంతరం చెప్పినా ఆమె వినలేదు. దీంతో ఇరువురి మధ్య గొడవలు జరిగేవి. చివరికి గురువారం కుమార్ ఓ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.