Economic Inequalities | న్యూఢిల్లీ, మార్చి 20: భారత్లో ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, 1 శాతం జనాభా చేతిలో 40.1 శాతం సంపద ఉన్నదని పలువురు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. ‘భారతదేశంలో ఆదాయ, సంపదలో అసమానతలు, 1922 – 2023: ది రైజ్ ఆఫ్ ది బిలియనీర్ రాజ్’ పేరుతో వివిధ అంతర్జాతీయ ఆర్థిక సంస్థలకు చెందిన థామస్ పికెట్టి, లుకాస్ ఛాన్సెల్, నితిన్ కుమార్ భారతి ఒక నివేదిక రూపొందించారు. 2014 – 15 నుంచి 2022 – 23 మధ్యకాలంలో సంపదను కేంద్రీకరించడం వల్ల ఈ అసమానతలు ఎక్కువగా పెరిగాయని ఈ నివేదిక పేర్కొన్నది.