కోల్కతా: గుజరాత్ రాష్ట్రం మోర్బీలో కేబుల్ బ్రిడ్జి కూలిపోయి 142 మంది మృతిచెందినా ఆ ప్రమాదానికి బాధ్యులైన వారిపై ఈడీ, సీబీఐ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి ప్రశ్నించారు. వాళ్లు కేవలం సామాన్యులపైనే తమ ప్రతాపం చూపిస్తారని ఆమె విమర్శించారు.
ప్రమాదం జరిగింది ప్రధాని సొంత రాష్ట్రంలో అయినంత మాత్రాన తాను ఆయన గురించి ఏదో మాట్లాడనుకోవడంలేదని, తాను రాజీకీయాల గురించి ఏదీ మాట్లాడబోనని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు మమత సమాధానమిచ్చారు. రాజకీయాల కంటే ప్రజల ప్రాణాలు ముఖ్యం కాబట్టి ఈ ఘటనపై తాను కామెంట్ చేయబోనని చెప్పారు.
మోర్బీ కేబుల్ బ్రిడ్జి ప్రమాదంలో భారీ ప్రాణ నష్టం జరిగిందని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు పరిధిలో జ్యుడీషియల్ కమిటీ వేసి విచారణ జరిపించాలని మమతాబెనర్జి డిమాండ్ చేశారు.