హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): నేటి ఆధునిక యుగంలో పురుషులతో సమానంగా రాణిస్తున్న మహిళలను ఇంటికే పరిమితంచేసే రోజులు పోయాయి. కుటుంబ బాధ్యతలతోపాటు ఆర్థిక, రాజకీయ వ్యవహారాల్లో మహిళలకు పురుషులతో సమానంగా హక్కులు ఉండాలని దేశంలోని ప్రతి 10 మందిలో 8 మంది చెప్తున్నారు. ఉద్యోగాల విషయంలో పురుషులకు ఎక్కువ హక్కులు ఉండాలని 80% మంది భావిస్తున్నట్టు అమెరికాకు చెందిన ప్యూ రిసెర్చ్ సెంటర్ తేల్చింది. ‘జెండర్ రోల్’పై 2019-20లో నిర్వహించిన సర్వేలో భాగంగా ఈ సంస్థ దేశంలోని అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 29,999 మందిని ఇంటర్వ్యూ చేసింది. ఇటీవలే విడుదలైన ఆ నివేదికలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాలు ఇవీ..
పురుషులతో సమానంగా రాణించగలరు 55%
పురుషుల కంటే మెరుగ్గా రాణించగలరు 14%
పురుషుల స్థాయిలో రాణించలేరు 25%
దేశంలో మహిళలపై నేరాలే అతిపెద్ద సమస్య అని 76% మంది చెప్పారు. ఈ సమస్య పరిష్కారానికి అధిక ప్రాధాన్యమివ్వాలని, మగ పిల్లలకు చిన్నతనం నుంచే మహిళలను గౌరవించడం నేర్పించాలని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు.
మగ పిల్లలకు మహిళలను గౌరవించడం నేర్పాలి 51%
ఆడపిల్లలు సరిగా ప్రవర్తించడం తెలుసుకోవాలి 26%
పై రెండింటిలో దేన్ని సమర్థించాలో నిర్ణయించుకోలేదు 23%
అనుమతిస్తే బాగుంటుంది:26%
తప్పక అనుమతించాలి 14%
అనుమతించకపోవడమే మంచిది:42%
ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించొద్దు:11%
ఎలాంటి అభిప్రాయం లేదు: 7%