న్యూఢిల్లీ: ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ కృష్ణ కాన్సియస్నెస్(ఇస్కాన్) మంగళవారం కీలక నిర్ణయం తీసుకున్నది. ధర్మ ప్రచారకుడు అమోఘ్ లీలా దాస్(Amogh Lila Das)ను ఇస్కాన్ బ్యాన్ చేసింది. స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంసపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనపై చర్యలు తీసుకున్నారు. లీలా దాస్ వయసు 43 ఏళ్లు. ఆధ్మాత్మికవేత్తగా.. లైఫ్స్టయిల్ కోచ్గా, మోటివేషన్ స్పీకర్గా ఆయన పాపులర్. గడిచిన 12 ఏళ్ల నుంచి ఆయన ఇస్కాన్లో పనిచేస్తున్నారు. ద్వారకలో ఉన్న ఇస్కాన్ ఆలయంలో వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నారు.
అమోఘ్ లీలా దాస్ అసలు పేరు ఆశిశ్ అరోరా. లక్నోలోని పంజాబీ కుటుంబంలో ఆయన జన్మించారు. ప్రస్తుతం ఆయన న్యూఢిల్లీలో నివసిస్తున్నారు. 2004లో ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి ఆయన సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్లో డిగ్రీ పూర్తి చేశారు. కొన్నాళ్లు అమెరికాకు చెందిన బహుళజాతి కంపెనీలో పనిచేశారు. 2010లో కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేశారు. 29 ఏళ్ల వయసులో ఇస్కాన్లో చేరిన ఆయన బ్రహ్మచారిగా ఉన్నారు.
సోషల్ మీడియాలో లీలా దాస్కు అభిమానులు ఎక్కువే ఉన్నారు. మతం గురించి ఆయన పోస్టు చేసిన వీడియోలు ఆన్లైన్లో వైరల్ అవుతుంటాయి. ఇటీవల ఓ వీడియోలో ఆయన స్వామి వివేకానంద ఆహార అలవాట్లు, టీచర్ రామకృష్ణ పరమహంస గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దీంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. పబ్లిక్ ఈవెంట్లలో పాల్గొనరాదు అని ఇస్కాన్ ఆయనపై నిషేధం విధించింది. ఆ సన్యాసి తన తప్పుల్ని అంగీకరించినట్లు ఇష్కాన్ పేర్కొన్నది.
స్వామి వివేకానంద ఎలా చేపలను తిన్నారని ప్రవచనకర్త ప్రశ్నించారు. ధార్మిక వ్యక్తి చేపల్ని తినడాన్ని ఆయన తప్పుపట్టారు.