న్యూఢిల్లీ, జూన్ 1: దేశంలో బొగ్గు కొరతపై మాజీ ఐఏఎస్, బొగ్గుమంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి అనిల్ స్వరూప్ కీలక వ్యాఖ్యలు చేశారు. బొగ్గు నిల్వలు పుష్కలంగా ఉన్నా డిమాండ్కు సరిపడా బొగ్గును సరఫరా చేయడంలో కేంద్రం విఫలమవ్వడంతోనే సంక్షోభం ముసురుకొన్నట్టు పేర్కొన్నారు. బొగ్గు రవాణాకు రైల్వే వ్యాగన్లను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం ఫెయి ల్ అయినట్టు వెల్లడించారు. సంక్షోభ నివారణకు ఢిల్లీలో కూర్చొని సంప్రదింపులు చేస్తే కుదరదని, రాష్ర్టాలు, కోల్ ఇండియాతో కలిసి కేంద్రం పరిష్కార మార్గాలను అన్వేషించాలని సూచించారు. తాను బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా ఉన్నప్పుడు రెండు నెలలకోసారి రాష్ర్టాలకు వెళ్లి బొగ్గు నిల్వలను స్వయంగా పరిశీలించేవాడినని గుర్తుచేశారు.