రాయ్పూర్: అగ్నిపథ్ స్కీమ్పై చత్తీస్ఘడ్ సీఎం భూపేశ్ భగల్ ఆందోళన వ్యక్తం చేశారు. పర్మనెంట్ రిక్రూట్మెంట్ ఎందుకు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. రెండేళ్ల కోసం ఎందుకు రిక్రూట్ చేయడంలేదని సెటైర్ వేశారు. నాలుగేళ్ల తర్వాత యువకుడు ఇంటికి నిరుద్యోగిలా వస్తే, అలాంటి సమయంలో ఇంత భారీ సంఖ్యలో ఉన్న యువతను ఏ దశంలోకి రిక్రూట్ చేసుకుంటారని భూపేశ్ భగల్ ప్రశ్నించారు. ఒకవేళ పోలీసు దళంలోకి వాళ్లకు తీసుకోకుంటే అప్పుడు ఏం జరుగుతుందని సీఎం అడిగారు. పిస్తోళ్లను ఎలా ఆపరేట్ చేయాలో వాళ్లు నేర్చుకుంటారని, మరి అలాంటప్పుడు ఈ సమాజాన్ని ఎటు వైపు తీసుకువెళ్తున్నారని సీఎం ప్రశ్నించారు. మీ ఆలోచనలు స్వచ్ఛంగా ఉన్నట్లు కనిపించడంలేదన్నారు. యువతను మధ్యలో వదిలేస్తే వాళ్లు గ్యాంగ్లుగా మారుతారని, వాళ్లే నేరాల్లో పాలు పంచుకునే అవకాశాలు ఉన్నట్లు చత్తీస్ఘడ్ సీఎం భగల్ అన్నారు.