Lalit Modi | దేశంలోనే టాప్ లాయర్ (Top Lawyer), మాజీ సొలిసిటర్ జనరల్ (Former Solicitor General) హరీష్ సాల్వే (Harish Salve) 68 ఏళ్ల వయసులో మూడో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. త్రినా (Trina) అనే మహిళను ఘనంగా పెళ్లాడారు. కాగా, హరీష్ సాల్వే వివాహం ప్రస్తుతం భారత్లో రాజకీయ దుమారం రేపుతోంది. అందుకు కారణం వీరి వివాహానికి లలిత్ మోదీ (Lalit Modi) హాజరుకావడమే.
లండన్ (London)లో ఆదివారం జరిగిన ఈ వివాహ వేడుకకు ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ, సునీల్ మిట్టల్, ఎల్ఎన్ మిట్టల్, ఎస్వీ లోహియా, గోపీ హిందూజా వంటి ప్రముఖులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీరితోపాటు భారత క్రికెట్ బోర్డు బీసీసీఐ (BCCI)ని వందల కోట్ల మేర మోసం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొని దేశం విడిచి పరారైన ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ ఈ వివాహానికి హాజరుకావడంపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నాయి.
భారత్లో ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ (One Nation, One Election.) కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవలే అత్యున్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీకి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షత వహించనున్నారు. అయితే ఈ కమిటీలో హరీష్ సాల్వే కూడా సభ్యుడిగా ఉన్నారు. అత్యున్నత స్థాయి కమిటీలో సభ్యుడిగా ఉన్న వ్యక్తి వివాహానికి పన్ను ఎగవేత, మనీలాండరింగ్ కేసులో దేశం విడిచి పరారైన లలిత్ మోదీ హాజరు కావడంపై ప్రతిపక్ష నాయకులు మండిపడుతున్నారు. ఈ మేరకు శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ( Priyanka Chaturvedi ) తీవ్రస్థాయిలో స్పందించారు.
‘ప్రభుత్వ ఏకరీతి వివాహ చట్టాలపై ఊదరగొడుతున్న వేళ బీజేపీకి చెందిన ప్రముఖ లాయర్ మూడో పెళ్లి చేసుకోవడాన్ని నేను పట్టించుకోను. కానీ ప్రతి ఒక్కరూ ఆందోళన చెందాల్సిన విషయం ఏంటంటే..? మోదీ ప్రభుత్వానికి ఇష్టమైన న్యాయవాది వివాహానికి.. భారత చట్టాల నుంచి తప్పించుకుని దేశం విడిచి పారిపోయిన వ్యక్తి ఆహ్వానితుడిగా ఉన్నాడు. ఎవరు ఎవరికి సహాయం చేస్తున్నారు..? ఎవరు ఎవరిని రక్షిస్తున్నారు..? అనేది ఇప్పుడు ప్రశ్న కాదు’ అంటూ వ్యాఖ్యానించారు.
మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రితేశ్ షా (Pritesh Shah) కూడా మోదీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘నీరవ్ మోదీ, లలిత్ మోదీని దొంగలన్నందుకు కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్గాంధీపై అనర్హత వేటు వేశారు. ఇప్పుడు మోదీ ప్రభుత్వం ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’పై ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీలో సభ్యుడిగా ఉన్న హరీష్ సాల్వేతో మనీలాండరింగ్ కేసులో దేశం విడిచి పారిపోయిన లలిత్ మోదీ ఎంజాయ్ చేస్తున్నాడు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’ కమిటీ సభ్యుడు హరీష్ సాల్వే.. ఇప్పుడు ఇద్దరు మోసగాళ్లు లలిత్ మోదీ, మోయిన్ ఖురేషీతో సంతోషంగా గడుపుతున్నారు అని కాంగ్రెస్ ఓవర్సీస్ కో ఆర్డినేటర్ విజయ్ తొట్టితిల్ విమర్శించారు.
Former Solicitor general of India, #HarishSalve got married for the 3rd time. Nita Ambani, Lalit Modi amongst others attended the ceremony.
Hopefully he is lucky the third time. pic.twitter.com/RVSPXyTujC
— Kumar Mihir Mishra (@Mihirlawyer) September 4, 2023
Also Read..
Harish Salve | 68 ఏళ్ల వయసులో ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్న టాప్ లాయర్.. హాజరైన ప్రముఖులు
Vijay Deverakonda | ఖుషి సక్సెస్తో ఫుల్ ఖుషీలో విజయ్.. ఫ్యాన్స్కు రూ.కోటి ఇస్తానంటూ ప్రకటన
G20 Summit | ఆ మూడు రోజులు ఢిల్లీలో స్విగ్గీ, జొమాటో, అమెజాన్ సహా పలు ఆన్లైన్ డెలివరీ సేవలు బంద్