Aditi Tatkare | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్న అజిత్ పవార్.. తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా, ఆయన వర్గంలోని 8 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేసిన విషయం విదితమే. అయితే ఏక్నాథ్ షిండే కేబినెట్లో తొలిసారిగా ఎన్సీపీకి చెందిన ఓ మహిళా ఎమ్మెల్యే మంత్రిగా ప్రమాణం చేశారు. దీంతో షిండే కేబినెట్లో మహిళలకు ప్రాధాన్యం లేదనే అపవాదు తొలగిపోయింది.
అయితే మహిళా మంత్రిగా ప్రమాణం చేసిన అదితి థాకరే ఎవరనే విషయంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అదితి థాకరే ఎన్సీపీ సీనియర్ నాయకులు సునీల్ థాకరే కుమార్తె. మహారాష్ట్ర అసెంబ్లీకి శ్రీవర్ధన్ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేగా 2019, నవంబర్ 26న ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత డిసెంబర్ 30వ తేదీన మంత్రిగా ప్రమాణం చేశారు. మంత్రి పదవిలో జూన్ 29, 2022 వరకు కొనసాగారు అదితి థాకరే. టూరిజం, ప్రజా సంబంధాలు, న్యాయ, పౌరసరఫరాల శాఖలను ఆమె హ్యాండిల్ చేశారు. 2017 నుంచి 2019 వరకు రాయ్గడ్ జిల్లా పరిషత్ ప్రెసిడెంట్గా అదితి కొనసాగారు. ఆమె స్వస్థలం మహారాష్ట్రలోని రోహా పట్టణం.
సునీల్ థాకరే కూడా సుదీర్ఘ కాలం ఎమ్మెల్యేగా సేవలందించారు. కాంగ్రెస్ – ఎన్సీపీ డెమోక్రటిక్ ఫ్రంట్ గవర్నమెంట్లో మంత్రిగా కొనసాగారు. ఆయన కూడా సివిల్ సప్లయిస్, జల వనరులు, ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.