మణిపూర్లో బీజేపీ విజయానికి దగ్గర్లో ఉంది. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ 18 వేల మెజారిటీతో విజయం సాధించారు. 32 సీట్లలో లీడింగ్లో ఉంది. ఇక.. నాగా పీపుల్స్ ఫ్రంట్ రెండు సీట్లు గెలుచుకొని, 5 సీట్లలో ముందంజలో ఉంది. ఇక.. నేషనల్ పీపుల్స్ పార్టీ 5 సీట్లలో ముందంజలో ఉంది. ఇక.. నితీశ్ నేతృత్వంలోరని జేడీయూ ఇప్పటికి 3 స్థానాల్లో విజయం సాధించి.. మొదటి సారి మణిపూర్లో ఖాతా తెరిచింది.
అయితే ఇంతకు బీజేపీ సీఎం ఎవరన్నదే ఆసక్తికర ప్రశ్న. ఎన్నికల తర్వాత తమ సీఎం అభ్యర్థిని ప్రకటిస్తామని బీజేపీ పేర్కొంది. అంతర్గతంగా ప్రస్తుత సీఎం బీరేన్ సింగ్పై ఎమ్మెల్యేల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ కారణంగానే ఈసారి ఆయనకు ఛాన్స్ ఉండదని పేర్కొంటున్నారు. మొన్నటికి మొన్న ఎన్పీపీకి చెందిన ఎమ్మెల్యేలు అందరూ గతంలో ప్రభుత్వ పదవులకు రాజీనామాలు చేసి వెళ్లిపోయారు. సీఎం బీరేన్ సింగ్ వ్యవహార శైలి నచ్చకే వీరందరూ మూకుమ్మడి రాజీనామాలు చేసేశారు. వెంటనే ఆయన్ను మార్చాలని కూడా అప్పట్లో డిమాండ్లు వచ్చాయి. దీంతో హైకమాండ్ జోక్యం చేసుకొని, సర్దుబాటు చేసింది. అయితే సీఎం రేసులో బీరేన్ సింగ్, కేబినెట్ మంత్రి థొంగమ్ విశ్వజిత్ సింగ్, గోవింద్ దాస్ కొంథోజోమ్, స్పీకర్ యుంనమ్ ఖేమ్చంద్ సింగ్ రేసులో వున్నారు.