న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ( Rahul Gandhi ) మరోసారి నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. అత్యధిక జనాభా ఉన్న దేశంలో ఇంకా చాలా మంది వ్యాక్సిన్లు తీసుకోవాల్సి ఉన్నదని, డిసెంబర్ చివరికల్లా కేవలం 42 శాతం మందికి మాత్రమే వ్యాక్సినేషన్ పూర్తయ్యే అవకాశం ఉన్నదని రాహుల్గాంధీ ఆందోళన వ్యక్తంచేశారు. వాస్తవానికి కరోనా థర్డ్ వేవ్ను ఎదుర్కోవడం కోసం డిసెంబర్ చివరికల్లా 60 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తికావాల్సి ఉందని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు.
వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇంత మందకొడిగా కొనసాగితే బూస్టర్ డోసులు ఎప్పుడు మొదలుపెడుతారని రాహుల్గాంధీ ప్రశ్నించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. వాస్తవంగా ఇవ్వాల్సిన దానికంటే రోజుకు 55.5 మిలియన్ డోసుల వ్యాక్సిన్ల కొరత ఉంటున్నదని పేర్కొన్నారు. దేశాన్ని మరో కరోనా వేవ్ చుట్టుముట్టక ముందే ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.