హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ) : 2023-24 మార్కెటింగ్ సీజన్కు సంబంధించి ఆరు రకాల యాసంగి సీజన్ పంటలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలను ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం జరిగిన కేంద్ర క్యాబినెట్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
యాసంగిలో ప్రధాన పంటలైన గోధుమ, బార్లీ, ఎర్రపప్పు, శనగలు, ఆవాలు, కుసుమకు ఎంఎస్పీ పెంచారు. ఇందులో అత్యధికంగా ఎర్రపప్పు(కందిలో రకం) ధర రూ.500 పెంచింది. క్యాబినెట్ నిర్ణయం ప్రకారం గోధుమకు రూ.2,125, బార్లీ రూ.1,735, శనగ రూ.5,335, ఎర్రపప్పు రూ.6,000, ఆవాలు రూ.5,450, కుసుమ రూ.5,650గా నిర్ణయించింది.