సంవత్సరం ముగియడానికి వస్తోంది. ఈ సంవత్సరంలో ఏయే అంశాలను భారతీయులు ఎక్కువగా గూగుల్ చేశారో ఆ సంస్థ ఓ జాబితాను విడుదల చేసింది. అయితే టాప్ 5 లో మాత్రం క్రీడలకు సంబంధించినవే ఎక్కువగా ఉండటం విశేషం. ఇండియన్ ప్రీమియర్ లీగ్, కోవిన్, ఐసీసీ టీ 20 వరల్డ్ కప్, యూరో కప్, టోక్యో ఒలింపిక్స్ వీటినే ప్రజలు ఎక్కువగా గూగుల్ చేశారని పేర్కొంది. ఇక గూగుల్లో సెలెబ్రెటీల గురించి కూడా ప్రజలు బాగానే సెర్చ్ చేశారు. అందులో ఎక్కువగా… నీరజ్ చోప్రా, (ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్), ఆర్యన్ ఖాన్, (షారూఖ్ ఖాన్ కుమారుడు) షెహనాజ్ గిల్ (బిగ్బాస్ కంటెస్టెంట్), రాజ్ కుంద్రా (పోర్నోగ్రఫీ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి. శిల్పాశెట్టి భర్త), ఎలన్ మస్క్ (ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుడు) వీరి గురించి ఎక్కువగా సెర్చ్ చేశారని తేలింది.
ఇక సినిమాల విషయానికి వస్తే, తమిళ సినిమా జైభీమ్ గురించి గూగుల్లో ఎక్కువగా సెర్చ్ చేశారట. ఆ తర్వాత షేర్షా (హిందీ), రాధే (హిందీ), బెల్ బాటమ్ (హిందీ), ఎటర్నల్స్ (ఇంగ్లీష్) సినిమాల గురించి ఎక్కువగా సెర్చ్ చేశారట.