లక్నో: ఉత్తరప్రదేశ్కు చెందిన సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ పోలీసులు ఇచ్చిన చాయ్ తాగేందుకు నిరాకరించారు. ఒకవేళ అందులో విషం కలిపి ఉంటే? అంటూ అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులను తాను నమ్మబోనని, వారు ఆఫర్ చేసిన టీని తీసుకోనని చెప్పారు. లక్నోలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. ట్విట్టర్లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఎస్పీ కార్యకర్త మనీష్ జగన్ అగర్వాల్పై మూడు కేసులు నమోదయ్యాయి. దీంతో పోలీసులు ఆదివారం ఆయనను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఎస్పీ కార్యకర్తలు లక్నోలోని డీజీపీ ప్రధాన కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. మనీష్ జగన్ అగర్వాల్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కాగా, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ డీజీపీ కార్యాలయంలోకి వెళ్లారు. ఈ సందర్భంగా పోలీసులు ఇచ్చిన టీని తాగేందుకు ఆయన నిరాకరించారు. పోలీసులపై తనకు నమ్మకం లేదని వారితో చెప్పారు. అందులో విషం కలిపి ఉంటే? అంటూ అనుమానం వ్యక్తం చేశారు. టీ తాగాలని అనిపిస్తే తానే స్వయంగా బయట నుంచి తెచ్చుకుంటానని పోలీసులతో అన్నారు. తమ కార్యకర్త మనీష్ జగన్ అగర్వాల్ను విడుదల చేయాలని అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు.
#WATCH समाजवादी पार्टी प्रमुख अखिलेश यादव ने पुलिस मुख्यालय में चाय पीने से इंकार किया।
उन्होंने कहा,"हम यहां की चाय नहीं पियेंगे। हम अपनी (चाय) लाएंगे, कप आपका ले लेंगे। हम नहीं पी सकते, ज़हर दे दोगे तो? हमें भरोसा नहीं। हम बाहर से मंगा लेंगे।"
(वीडियो सोर्स: समाजवादी पार्टी) pic.twitter.com/zwlyMp8Q82
— ANI_HindiNews (@AHindinews) January 8, 2023