LPG Price Hike | న్యూఢిల్లీ, మార్చి 2: మోదీ సర్కారు ఎల్పీజీ సిలిండర్పై ఒకేసారి రూ.50 పెంచడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలపై గ్యాస్ బండ బాదుడుపై వ్యంగ్యాత్మకంగా విమర్శించారు. ‘గ్యాస్పై రూ.50 పెరిగిందా? వారు తమకు తాము ఆమ్ ఆద్మీ సర్కార్గా చెప్పుకుంటారు కదా? సిగ్గుచేటు’ అని 2011లో ప్రతిపక్ష బీజేపీ నాయకులు స్మృతి ఇరానీ చేసిన ట్వీట్ను ఇప్పుడు రీ ట్వీట్ చేస్తూ, గ్యాస్ సిలిండర్తో రోడ్డుపై ధర్నా చేస్తున్న ఆమె ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు.
నాడు ఆందోళనలు చేసిన స్మృతి ఇరానీ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? అని నిలదీశారు. నాడు సిలిండర్ ధర రూ.400 లోపు ఉండగా రూ.50 పెంచడంపై ధర్నా చేసిన మీరు.. ఇప్పుడు గ్యాస్ ధర 1,100 దాటినప్పటికీ రూ.50 పెంచడంపై ధర్నా చేయరా? కాంగ్రెస్ అని నిలదీసింది. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీ నాడు ప్రతిపక్ష హోదాలో మీడియాతో మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.