వారణాసి: తనను, డబ్ల్యూఎఫ్ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ను చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయని ఇటీవల సస్పెన్షన్కు గురైన డబ్ల్యూఎఫ్ఐ కొత్త అధ్యక్షుడు సంజయ్ సింగ్ పేర్కొన్నారు.
ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు వారణాసి పోలీసులు ఆదివారం తెలిపారు. ఈ నెల 12న రాత్రి సమయంలో ఒక వ్యక్తి గుర్తు తెలియని నంబర్ నుంచి రెండు సార్లు ఫోన్ చేశాడని, తాను లిఫ్ట్ చేయలేదని పేర్కొన్నారు. తర్వాతి రోజున అదే నంబర్ నుంచి మళ్లీ కాల్ రాగా.. లిఫ్ట్ చేశానని, తన ను, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ను హత్య చేస్తానని ఆ దుండగుడు బెదిరించారని తెలిపారు.