ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని లోకల్ రైల్వే స్టేషన్లలో భద్రతపై పశ్చిమ రైల్వే దృష్టిసారించింది. ఇందులో భాగంగా విరార్ నుండి చర్చ్గేట్ వరకు ఉన్న 30 లోకల్ రైల్వే స్టేషన్లలో 2,729 సీసీ కెమెరాలను ఇన్స్టాల్ చేస్తోంది. ఇవి 4కే టెక్నాలజీతో కూడిన ఇంటిగ్రేటెడ్ సర్వైలెన్స్ సిస్టమ్ కెమెరాలని పశ్చిమ రైల్వే సీపీఆర్వో సుమిత్ ఠాకూర్ తెలిపారు. ఏర్పాటు చేసే 2,729 కెమెరాలలో 450 కెమెరాలు ముఖ గుర్తింపు సాంకేతికత కలిగి ఉన్నాయని చెప్పారు. అక్టోబర్ చివరి నాటికి ఈ సిస్టమ్ పూర్తిగా యాక్టివేట్ అవుతుందని సుమిత్ ఠాకూర్ వెల్లడించారు.