కోల్కతా: పశ్చిమబెంగాల్లో ఖాళీగా ఉన్న నాలుగు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార టీఎంసీ హవా కొనసాగుతున్నది. మొత్తం నాలుగు స్థానాల్లో ఇప్పటికే ఒక స్థానంలో విజయం సాధించిన బీజేపీ.. మరో మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నది. గోసబ అసెంబ్లీ నియోజకవర్గంలో టీఎంసీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి సుబ్రత మండల్ భారీ మెజారిటీతో గెలిచారు. ఇక బీజేపీ సిట్టింగ్ స్థానమైన దిన్హటాలో టీఎంసీ సత్తా చాటుతున్నది. టీఎంసీ అభ్యర్థి ఉదయన్ భారీ మెజారిటీలో ఉన్నారు. సంతీపూర్ అసెంబ్లీ స్థానంలోనూ టీఎంసీ నేత బ్రజా కిషోర్ గోస్వామి లీడింగ్లో ఉన్నారు. ఖార్దా అసెంబ్లీ స్థానంలో మంత్రి సోవన్దేవ్ చటోపాధ్యాయ ఆధిక్యంలో ఉన్నారు.