కోల్కతా: పశ్చిమ బెంగాల్లో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఏడేండ్ల బాలుడికి కొత్త వేరియంట్ కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. రాష్ట్రంలోని ముర్షిదాబాద్ జిల్లాకు చెందిన ఆ బాలుడు హైదరాబాద్ మీదుగా బెంగాల్కు వచ్చినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఆ నెల 10న ఆ బాలుడు తన పేరెంట్స్తో కలిసి అబూ దాబీ నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నాడని చెప్పారు. అక్కడ చేసిన కరోనా పరీక్షలో పాటిజివ్గా తేలిందన్నారు. అయితే బాలుడి తల్లిదండ్రులకు కరోనా టెస్ట్లో నెగిటివ్ వచ్చిందన్నారు. అతడు తన పేరెంట్స్తో కలిసి బెంగాల్ వచ్చినట్లు అధికారులు చెప్పారు. జీనోమ్ సీక్వెన్సింగ్లో ఆ బాలుడికి ఒమిక్రాన్ వేరియంట్ కరోనా సోకినట్లుగా బుధవారం నిర్ధారణ అయ్యిందని తెలిపారు. దీంతో ముర్షిదాబాద్ జిల్లాలోని ఆసుపత్రిలో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నట్లు పశ్చిమ బెంగాల్ ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.