కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. ఆ రాష్ట్ర ఎమ్మెల్యేల జీతాలను(MLA Salaries) పెంచారు. 40వేల వరకు జీతాన్ని పెంచుతున్నట్లు ఆమె తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీలో ఇవాళ ఆమె ఈ ప్రకటన చేశారు. అయితే ముఖ్యమంత్రి నెల జీతాన్ని మాత్రం మార్చడం లేదన్నారు. చాన్నాళ్ల నుంచి సీఎం మమతా బెనర్జీ ఎటువంటి జీతాన్ని తీసుకోవడం లేదు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. బెంగాల్లో ఎమ్మెల్యేల జీతాలు చాలా తక్కువగా ఉన్నాయని, అందుకే ప్రతి నెల 40వేల జీతాన్ని పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు దీదీ తెలిపారు. అయితే పెరిగిన జీతంతో మొత్తం ఎంత తీసుకుంటారన్న విషయాన్ని మాత్రం ఆమె వెల్లడించలేదు.
బెంగాలీ కొత్త సంవత్సరం..
పొలై బైసాకీ రోజును.. బెంగాలీ కొత్త సంవత్సరంగా సెలబ్రేట్ చేసుకునేందుకు ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానించింది. రాష్ట్ర గవర్నర్ ఈ తీర్మానానికి ఆమోదం చేసినా, చేయకున్నా తాము మాత్రం బెంగాలీ కొత్త సంవత్సరాన్ని జూన్ 20వ తేదీన జరుపుకోనున్నట్లు సీఎం మమతా తెలిపారు.