కోల్కతా, మార్చి 13: పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ తన సొంత తమ్ముడు బాబున్ బెనర్జీకి షాక్ ఇచ్చారు. హౌరా లోక్సభ సీటును మళ్లీ ప్రసూన్ బెనర్జీకి కేటాయించడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన బాబున్తో బంధుత్వాన్ని తెంచుకున్నట్టు మమత తెలిపారు. బుధవారం ఆమె జల్పాయ్గురిలో విలేకర్లతో మాట్లాడుతూ.. తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాపై అసహనం వ్యక్తం చేసిన బాబున్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రతి ఎన్నికలకు ముందు ఆయన ఏదో ఒక సమస్యను సృష్టిస్తుంటారని, అత్యాశపరులంటే తనకు ఇష్టం ఉండదని, కుటుంబ రాజకీయాలను విశ్వసించబోనని పేర్కొన్నారు.