WEF | న్యూఢిల్లీ: భారత్, అమెరికా, బ్రిటన్, మెక్సికో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఈ ఏడాది ఎన్నికలు జరుగనున్నాయి. దాదాపు 300 కోట్ల మంది ఎన్నికల క్రతువులో భాగం కానున్నారు. అయితే తప్పుడు సమాచార వ్యాప్తి ఎన్నికలకు పెను ముప్పుగా పరిణమించిందని, ఆయా దేశాల్లో ఎన్నికల ఫలితాలపైనా, ప్రజాస్వామ్య మనుగడపైనా ఇది తీవ్ర ప్రభావం చూపించనున్నదని ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) గ్లోబల్ రిస్క్ నివేదిక-2024 ఆందోళన వ్యక్తం చేసింది.
ఆర్థిక, పర్యావరణ, రాజకీయ, భౌగోళిక, సాంకేతిక తదితర 34 ముప్పులపై నివేదిక ర్యాంకులను ప్రకటించింది. తప్పుడు సమాచారం అతిపెద్ద ముప్పుగా ఉన్న
దేశాల్లో భారత్ తొలిస్థానంలో ఉన్నది. అమెరికా ఆరో స్థానంలో ఉన్నది.