న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ పాజిటివిటీ రేటు తగ్గుతున్నది. ప్రస్తుతం ఈ వారానికి దేశంలో వైరస్ పాజిటివిటీ రేటు 18.17 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొన్నది. రోజువారీ కోవిడ్ పాజిటివ్ కేసులు కూడా తగ్గినట్లు ప్రభుత్వం వెల్లడించింది. 26 రోజుల తర్వాత.. కరోనా వైరస్ పాజిటివ్ కేసులో తొలిసారి మూడు లక్షల లోపు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. గత 24 గంటల్లో సుమారు 15.73 లక్షల వైరస్ పరీక్షలు చేసినట్లు ప్రభుత్వం పేర్కొన్నది.
ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 20 కోట్ల మేర వ్యాక్సిన్లు అందించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇంకా సుమారు రెండు కోట్ల టీకాలు పలు రాష్ట్రాల వద్ద ఉన్నట్లు ప్రభుత్వం చెప్పింది. మరో మూడు రోజుల్లో అన్ని రాష్ట్రాలకు అదనంగా మూడు లక్షల డోసులు అందివ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.