తిరువనంతపురం, జూలై 29: కేరళలో కరోనా కేసులు మళ్లీ ఆందోళనకర స్థాయిలో పెరుగుతుండటంతో వారాంతంలో సంపూర్ణ లాక్డౌన్ విధించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. లాక్డౌన్ నిబంధనలు ఈ వారాంతం నుంచే అమల్లోకి రానున్నాయి. రాష్ట్రంలో కరోనా కట్టడికి సాయం చేసేందుకు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(ఎన్సీడీసీ) డైరెక్టర్ ఎస్కే సింగ్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల బృందాన్ని కేంద్రప్రభుత్వం కేరళకు పంపనున్నది. కేరళలో రోజుకు సగటున 17,443 కేసులు నమోదు అవుతున్నాయి. దేశంలో రోజూ నమోదవుతున్న కేసుల్లో సగం కేరళ నుంచే ఉంటున్నాయి.