Masks Mandatory | కరోనా (Corona) మహమ్మారి మరోసారి దేశాన్ని వణికిస్తున్నది. రోజు రోజుకు తీవ్ర పెరుగుతుండడంతో సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ (Mask)ను తప్పనిసరి చేశాయి. తాజాగా బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (BMC) కీలక నిర్ణయం తీసుకున్నది. ఆసుపత్రుల్లో (Hospitals) మాస్క్ ధరించడాన్ని తప్పనిసరి (Mask Masks Mandatory) చేసింది. అదే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో మాస్క్లను ధరించాలని ఉద్యోగులకు సూచించింది. ముంబయిలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో బీఎంసీ సమీక్ష నిర్వహించింది. సమావేశంలో మాస్క్ తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నది.
మహారాష్ట్రలో నిన్న 788 కొవిడ్ కేసులు రికార్డయ్యాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 81,49,929 చేరింది. గత శనివారం నుంచి కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో కరోనా మరణాల రేటు 1.82శాతం ఉండగా.. రికవరీ రేటు 98.12శాతంగా ఉంది. నిన్న 10,059 మందికి పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. మరో వైపు దేశవ్యాప్తంగా కొవిడ్ ఉధృతి కొనసాగుతున్నది. గత 24 గంటల్లో 5,880 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ వివరించింది. తాజా కేసులతో యాక్టివ్ కేసుల సంఖ్య 35,199కి చేరింది. మరో వైపు దేశవ్యాప్తంగా కొవిడ్ ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్ కొనసాగింది. కేసులు పెరిగితే సన్నద్ధతను అంచనా వేసేందుకు ఆరోగ్యశాఖ సోమ, మంగళవారాల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది. ప్రభుత్వ దవాఖానాలతో పాటు ప్రైవేటు హాస్పిటల్స్లోనూ ఈ మాక్ డ్రిల్ కొనసాగింది.