న్యూఢిల్లీ: కురచ దుస్తులు ధరించి ఆలయానికి వస్తే అనుమతించేది లేదని ఉత్తరాఖండ్లోని కొన్ని దేవాలయాలు ప్రకటించాయి. హరిద్వార్, రిషికేశ్, డెహ్రాడూన్లోని దక్ష్ ప్రజాపతి మందిర్, నీల్కాంత్ మహదేవ్ మందిర్, తాప్కేశ్వర్ మహదేవ్ మందిర్లలో నిషేధం అమల్లోకి వస్తుందని వెల్లడించాయి. మహిళలు తమ శరీరంపై 80 శాతం వరకు వస్ర్తాలు కలిగి ఉంటేనే ఆలయంలోనికి అనుమతిస్తామని పేర్కొన్నాయి. పలువురు భక్తులు పొట్టి దుస్తులు ధరించి ఆలయాలకు వస్తున్నారని, దీంతో మిగతా భక్తులు ఇబ్బందికి గురవుతున్నారని, అందుకే ఈ నిషేధం విధించామని ప్రకటించాయి.