కోల్కతా: భారత్ను తాలిబన్గా చేయడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను అనుమతించబోమని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శించారు. ఉప ఎన్నిక జరుగనున్న భవానీపూర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బుధవారం ఆమె మాట్లాడారు. ‘భారత్ ఐక్యంగానే ఉంటుంది. గాంధీ జీ, నేతాజీ, వివేకానంద, సర్దార్ వల్లభాయ్ పటేల్, గురు నానక్ జీ, గౌతమ్ బుధ, జైనులు … అందరూ దేశంలో కలిసే ఉంటారు. భారతదేశాన్ని విభజించడానికి ఎవరినీ అనుమతించం. నరేంద్ర మోదీ, కేంద్ర అమిత్ షాలు భారత్ను తాలిబన్ మారిదిగా చేయడాన్ని అనుమతించబోం’ అని మమత వ్యాఖ్యానించారు. బీజేపీ ఒక ‘జుమ్లా’ పార్టీ అని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో దుర్గా పూజ, లక్ష్మీ పూజలను తమ ప్రభుత్వం అనుమతించడం లేదంటూ వారు అబద్ధాలు చెబుతారని మండిపడ్డారు.