లక్నో, జనవరి 23: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విడిగా పోటీచేస్తున్నప్పటికీ, ఎన్నికల అనంతరం అవసరమైతే రాష్ట్రంలో బీజేపీకి ప్రధాన పోటీదారుగా ఉన్న సమాజ్వాదీతో పొత్తుకు సిద్ధంగానే ఉన్నట్టు కనిపిస్తున్నది. ఈ ప్రచారానికి బలం చేకూర్చేలా ఆ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ ఆదివారం ఓ న్యూస్ చానల్ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరమైన సమయంలో ఎస్పీ అధినేత అఖిలేశ్కు కాంగ్రెస్ మద్దతిస్తుందా? అనే ప్రశ్నకు ఆమె స్పందిస్తూ .. ‘అటువంటి పరిస్థితి ఎదురైతే ఒక నిర్ణయం తీసుకుంటాం. అయితే దీంతో నాకు ఎటువంటి సమస్య కనిపించడం లేదు. నిజానికి అటువంటి పరిస్థితే వస్తే, ఎందుకు మద్దతివ్వకూడదు?’ అని అన్నారు.