న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: లోక్సభ ఎన్నికల ముంగిట అనూహ్యమైన సవాళ్లను ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఓటర్లను ఆకట్టుకునేందుకు ‘ఆప్ కా రామరాజ్య’ వెబ్సైట్ను బుధవారం ప్రారంభించింది. ఆప్ నేతలు సంజయ్ సింగ్, అతిషి, సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ రామరాజ్యం సాధిస్తామని, దాని సాకారం కోసం కేజ్రీవాల్ గత పదేండ్లలో అద్భుతమైన విజయాలు సాధించారని చెప్పారు.