దేశ ఆర్థిక రాజధానిలో కరోనా విస్తృతిపై ఆ నగర మేయర్ కిషోరీ పెడ్నేకర్
ముంబై: దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్నది. ముంబై, ఢిల్లీ నగరాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉన్నది. ఈ నేపథ్యంలో ముంబై నగర మేయర్ కిషోరీ పెడ్నేకర్ కీలక ప్రకటన చేశారు. నగరంలో రోజువారీ కరోనా కేసుల 20 వేలు దాటితే లాక్డౌన్ విధిస్తామని స్పష్టంచేశారు. ప్రజలు సినిమా థియేటర్లు, గార్డెన్లు, మార్కెట్లకు భారీ సంఖ్యలో వెళ్తుండటం ఇలాగే కొనసాగితే లాక్డౌన్ కంటే ముందే మినీ లాక్డౌన్ కూడా విధించాల్సి వస్తుందని కిషోరీ పెడ్నేకర్ హెచ్చరించారు.