కోల్కతా: సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా లాంటిదని, దాన్ని నిర్మూలించాలని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యల పట్ల పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) స్పందించారు. ఉదయనిధి వ్యాఖ్యలను ఆమె వ్యతిరేకిస్తూ.. ఓ వర్గం ప్రజల మనోభావాల్ని దెబ్బతీసే రీతిలో వ్యవహరించడం సరికాదు అన్నారు. ఉదయనిధి స్టాలిన్ ఓ జూనియర్ నాయకుడని, కానీ ఏ కారణం చేత ఆయన ఆ వ్యాఖ్యలు చేశారో స్పష్టంగా తెలియదని, కానీ అన్ని మతాలను సమానంగా చూడాలన్నారు. తమిళనాడు, దక్షిణ రాష్ట్రాల ప్రజల్ని గౌరవిస్తున్నానని, ప్రతి మతానికి కొన్ని మనోభావాలు ఉంటాయని, వాటిని గౌరవించాలని అభ్యర్థిస్తున్నట్లు మమతా బెనర్జీ తెలిపారు.
భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం మనదని, సనాతన ధర్మాన్ని గౌరవిస్తానని, వేదాల నుంచే మనం అన్నీ నేర్చుకున్నామని, మన వద్ద ఎంతో మంది పురోహితులు ఉన్నారని, తమ రాష్ట్ర ప్రభుత్వం వాళ్లందరికీ పెన్షన్ ఇస్తోందని, దేశవ్యాప్తంగా ఎన్నో ఆలయాలు ఉన్నాయని, గుళ్లు, మసీదులు, చర్చిలను విజిట్ చేస్తుంటామని సీఎం తెలిపారు.