న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలని ఎవర్నీ వత్తిడి చేయడం లేదని కేంద్రం ప్రభుత్వం తెలిపింది. సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో ఈ విషయాన్ని ప్రభుత్వం స్పష్టం చేసింది. కోవిడ్19 మార్గదర్శకాల ప్రకారం స్వచ్ఛంధ అనుమతితోనే వ్యాక్సిన్లు ఇస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. దివ్యాంగులకు వ్యాక్సిన్ ద్రువపత్రం నుంచి మినహాయింపు ఇచ్చినట్లు వస్తున్న వార్తాలపై కేంద్రం స్పందించింది. వ్యాక్సిన్ సర్టిఫికేట్లు కలిగి ఉండాలని ఎక్కడా ఆదేశాలు ఇవ్వలేదని కోర్టుకు కేంద్రం తెలిపింది. ఎన్జీవో ఇవరా ఫౌండేషన్ వేసిన అభ్యర్థనకు బదులుగా కేంద్రం ఈ వివరణ ఇచ్చింది. ఇష్టానికి వ్యతిరేకంగా ఎవరికీ వ్యాక్సిన్ ఇవ్వడం లేదని కూడా కేంద్రం స్పష్టం చేసింది.