ముంబై: భారతీయ నేవీ మరో భారీ యుద్ధ నౌక(Aircraft Carrier)ను స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయనున్నది. చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ దీనిపై ఇవాళ ప్రకటన చేశారు. స్వదేశీ యుద్ధనౌక తయారీ ఆర్డర్ కోసం భారతీయ నౌకాదళం ఉత్సుకతో ఉన్నట్లు ఆయన తెలిపారు. అడ్వాన్స్డ్ స్టీల్త్ ఫ్రిగేట్ మహేంద్రగిరి జలప్రవేశం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు.
ఇటీవల ఐఎన్ఎస్ విక్రాంత్ను స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన విషయం తెలిసిందే. కొచ్చిన్ షిప్యార్డ్లో దాన్ని తయారు చేశారు. అయితే అదే తరహాలో మరో భారీ యుద్ధ నౌక నిర్మాణం కోసం ప్రిపరేషన్ జరుగుతన్నట్లు అడ్మిరల్ హరికుమార్ వెల్లడించారు. ఐఎన్ఎస్ విక్రాంత్ తరహాలోనే ఆ యుద్ధ నౌక ఉంటుందన్నారు. యుద్దనౌక నిర్మాణంలో కొచ్చిన్ నౌకాశ్రయం మంచి అనుభవాన్ని గడించినట్లు చెప్పారు. అయితే కొత్త యుద్దనౌక ఆర్డర్ కోసం ప్రిపరేషన్ జరుగుతుందన్నారు.
ప్రస్తుతం ఇండియా వద్ద రెండు యుద్ద నౌకలు ఉన్నాయి. ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఐఎన్ఎస్ విక్రాంత్ ఆ జాబితాలో ఉన్నాయి. యుద్ధ విమానాలను మోసుకెళ్లగలిగే తొలి స్వదేశీ యుద్ధ నౌకను గత ఏడాది సెప్టెంబర్లో జలప్రవేశం చేయించారు.