ప్రజా తీర్పును తాము శిరసావహిస్తున్నామని సమాజ్వాదీ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. గతంలో కంటే ఓట్ల శాతం, సీట్ల శాతాన్ని పెంచినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపింది. ఇక..బీజేపీ సీట్ల సంఖ్య తగ్గిందని, ఇది ఇలాగే మున్ముందు కొనసాగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నామని సమాజ్వాదీ పార్టీ పేర్కొంది.
యూపీ ఎన్నికల్లో సమాజ్వాదీ కూటమికి 113 స్థానాలు దక్కాయి. సమాజ్వాదీ 105 స్థానాల్లో, ఆర్ ఎల్డీ 8 స్థానాల్లో విజయం సాధించింది. సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ కర్హల్ నుంచి బరిలోకి దిగారు. విజయం సాధించారు. అయితే ఎన్నికల కంటే ముందే బీజేపీ నుంచి సమాజ్వాదీలోకి వచ్చిన మాజీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య ఓడిపోయారు.