Delhi floods | న్యూఢిల్లీ: దేశ రాజధాని నీటమునిగింది. యమునా నది (Yamuna river) ఉధృతి ఇంకా తగ్గకపోవడంతో ఢిల్లీలో (Delhi) ఎక్కడ చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. ఎర్రకోట, ముఖ్యమంత్రి అధికారిక నివాసం, సచివాలయం, మంత్రుల ఇండ్లు, ఎర్రకోట, రాజ్ఘాట్.. ప్రాంతాల్లో నీరు పెద్ద ఎత్తున చేరింది. రోడ్లు నదులను తలపిస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నగరంలోని పలు రోడ్లను అధికారులు మూసివేశారు. పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ప్రైవేటు ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేసుకోవాలని సూచించారు. వజీరాబాద్, చంద్రావాల్, ఓఖ్లాలోని మంచినీటి శుద్ధి ప్లాంట్లను (Water treatment plants) మూసేయాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అధికారుల్ని ఆదేశించారు. దీంతో హస్తినలో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
#WATCH Delhi: People face problems due to water-logging situation on ITO road due to the increase in the water level of the Yamuna River. pic.twitter.com/XEOY6F4BGl
— ANI (@ANI) July 14, 2023
యమునా నది ఇంకా ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తుండటంతో వరద (Flood) నీరు ఐటీఓ రోడ్డులోకి (ITO Road) చేరాయి. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతలకు తరలించారు. ఇక యమునా బ్రిడ్జిపై (Yamuna bridges) నుంచి మెట్రో రైళ్ల (Metro Trains) వేగ పరిమితిని (Speed limit) అధికారులు కుదించారు. గంటకు 30 కిలోమీటర్ల స్పీడ్తో బ్రిడ్జిపై నుంచి రైళ్లు ప్రయాణిస్తున్నట్లు చెప్పారు.
#WATCH Delhi: Waterlogging continues near Rajghat due to rise in water level in Yamuna river following heavy rains. pic.twitter.com/Zr0DA6ZomL
— ANI (@ANI) July 13, 2023
కాగా, వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ఇప్పటివరకు 23,692 మందిని శురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం 21,092 మంది పునరావాస కేంద్రాల్లో ఉన్నారని ప్రభుత్వం వెల్లడించింది. 1,022 మందిని నేషనల్ డిజాసర్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF)కి చెందిన 12 బృందాలు రక్షించాయని తెలిపింది.
ఢిల్లీ సీఎం అధికారిక నివాసం, సచివాలయం, మంత్రుల ఇండ్లు, ఎర్రకోట, రాజ్ఘాట్..ప్రాంతాల్లో నీరు పెద్ద ఎత్తున చేరింది. ఎర్రకోటలో సందర్శకుల ప్రవేశాన్ని శుక్రవారం వరకు నిలిపివేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. వరద నీటి కారణంగా సహాయక చర్యలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఆస్తులు పోగొట్టుకున్నా..
పెరుగుతున్న నగర జనాభా కారణంగా నగరాల్లో వరదలు సవాల్గా మారుతున్నాయని భారత వాతావరణ శాఖ చీఫ్ మృత్యుంజయ మహాపాత్ర వెల్లడించారు. దేశంలో సంభవిస్తున్న వరదలకు సంబంధించి ముందస్తు సమాచారం ఇచ్చి ప్రజల ప్రాణాలను కాపాడుతున్నామని ఆయన తెలిపారు. అదే సమయంలో ఆస్తి నష్టం భారీగా పెరుగుతున్నదని పేర్కొన్నారు. 2013 నాటి కేదార్నాథ్ వరదలతో తాజా హిమాచల్ వరదలను పోలిస్తే ఈ విషయం అర్థమవుతుందన్నారు.