లక్నో: ఆ ఊరి ప్రజలు ట్రాక్టర్లపై తమ కాలనీలకు వెళ్లి వస్తున్నారు. వర్షాల వల్ల తమ ప్రాంతం ఇంకా నీటి ముంపులోనే ఉండటం దీనికి కారణం. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ నియోజకవర్గమైన గొరఖ్పూర్ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నీట మునిగింది. గొరఖ్పూర్లోని ప్రేమ్ నగర్, విద్యా నగర్, కృష్ణానగర్, ఖలే టోల్ ప్రాంతాలు ఇంకా నీటి ముంపులోనే ఉన్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో సాధారణ జీవితం స్తంభించింది.
ఈ నేపథ్యంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది తమ ఇండ్ల నుంచి బయటకు రావడం లేదు. కాగా, నీట మునిగిన కాలనీల నుంచి ముఖ్యమైన పనుల కోసం బయటకు వెళ్లేందుకు సుమారు 13 ట్రాక్టర్లను ఏర్పాటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు.
మరోవైపు స్కూలుకు వెళ్లేందుకు చాలా ఇబ్బందిగా ఉన్నదని విద్యా నగర్కు చెందిన ఒక విద్యార్థిని వాపోయింది. చాలా రోజులుగా తమ ప్రాంతం నీట మునిగి ఉన్నదని ఆమె తెలిపింది. దీంతో స్కూలుకు వెళ్లేందుకు గంట నుంచి రెండు గంటల సమయం పడుతున్నదని తాను పడుతున్న ఇబ్బందిని ఆ బాలిక పేర్కొంది.