Water Bell | తిరువనంతపురం: ఎండాకాలంలో తగినంత నీరు తాగే విధంగా పాఠశాల విద్యార్థులను ప్రోత్సహించేందుకు కేరళ ప్రభుత్వం వాటర్-బెల్ విధానాన్ని సోమవారం నుంచి అమలు చేస్తున్నది. ఎండా కాలంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని, విద్యార్థినీ, విద్యార్థులు డీహైడ్రేషన్కు గురికావచ్చునని రాష్ట్ర సాధారణ విద్యా శాఖ మంత్రి వీ శివన్ కుట్టి చెప్పారు.
దాహం వేయకపోయినా, మంచినీళ్లు తాగవలసి ఉంటుందని, అందుకే వారికి గుర్తు చేయడం కోసం గంట కొట్టే విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. మంచి నీళ్లు తాగాలని విద్యార్థులకు గుర్తు చేయడం కోసం రోజూ నిర్ణీత సమయంలో రెండు సార్లు అన్ని పాఠశాలల్లోనూ గంటను మోగిస్తారు.