తిరువనంతపురం: ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్తుందంటే ఆ మార్గంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తారు. కాన్వాయ్ వెంట కూడా సుశిక్షితులైన పోలీసులు ఉంటారు. సీఎం అంగరక్షకులు ఉంటారు. ఇంతటి భారీ బందోబస్తుతో ఉండే భద్రతా వలయాన్ని దాటి సీఎం దగ్గరికి వెళ్లడం అసాధ్యం. కానీ కేరళలో సీఎం కాన్వాయ్కి మాత్రం భద్రతాలోపం కొట్టొచ్చినట్టు కనబడింది. కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేస్తూ కాన్వాయ్ని అడ్డుకున్నారు.
సీఎం పినరయి విజయన్ కాన్వాయ్ ఏ మార్గంలో వస్తుందో తెలుసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు, ఆ మార్గంలో కాపుగాశారు. కాన్వాయ్ అక్కడికి చేరుకోగానే నల్ల జెండాలను ప్రదర్శిస్తూ, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కాన్వాయ్కి అడ్డువెళ్లారు. సీఎం కాన్వాయ్ నడిరోడ్డుపై ఆగిపోవడంతో కంగుతిన్న పోలీసులు, కాన్వాయ్లోని అంగరక్షకులు ఆందోళనకారులను పక్కకు నెట్టేశారు. కేరళ బడ్జెట్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేసినట్లు సమాచారం.
#WATCH | Kerala: Youth Congress workers show black flags to CM Pinarayi Vijayan’s convoy as a protest against Kerala State Budget. pic.twitter.com/WQ7tbqLBdr
— ANI (@ANI) February 11, 2023