కోల్కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రం డార్జిలింగ్లోని పద్మజా నాయుడు హిమాలయన్ జూలో అడవిపిల్లి (జంగబిల్లి) కూనలు సందడి చేస్తున్నాయి. యాభై రోజుల క్రితం జూలోని ఓ అడవిపిల్లి మూడు పిల్లలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తమ ఎన్క్లోజర్లో ఆ పిల్లి కూనలు చేస్తున్న సందడి అంతాఇంతా కాదు. అయితే, కరోనా మహమ్మారి కారణంగా జూ మూసి ఉండటంతో సందర్శకులు ఆ పిల్లి కూనల సందడి చూసే అవకాశాన్ని కోల్పోయారు. కాగా, జూలో ఇదివరకు 5 అడవి పిల్లులు ఉండేవని, ఇప్పుడు ఈ పిల్లి కూనలతో కలిపి వాటి సంఖ్య 8కి చేరిందని జూ అధికారులు వెల్లడించారు.