డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో హెలిక్యాప్టర్ కుప్పకూలి ఏడుగురు దుర్మరణం పాలైన ప్రాంతంలో ప్రతికూల వాతావరణం కారణంగా సహాయక బృందాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. కొండ వాలు ప్రాంతంలో ఘటన జరగడం, విపరీతమైన చలి ఉండటం, వీటికి తోడు దట్టంగా మంచు కురుస్తుండటంతో వారికి రెస్క్యూ ఆపరేషన్ కష్టంగా మారింది.
ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను అక్కడి నుంచి తరలించడానికి రెస్క్యూ టీమ్స్లోని సభ్యులు చాలా అవస్థలు పడుతున్నారు. కాగా, ఘటన జరిగిన వెంటనే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF), పోలీస్ బలగాలు అక్కడి చేరుకుని రక్షణ, సహాయక చర్యలు చేపట్టాయి.
ఈ ఉదయం ఉత్తరాఖండ్లోని కేథార్నాథ్ పుణ్యక్షేత్రానికి యాత్రికులతో వెళ్తున్న హెలిక్యాప్టర్ ఫటా వద్ద కుప్పకూలింది. ప్రమాదంలో ఐదుగురు యాత్రికులు, ఇద్దరు పైలట్లు కలిపి మొత్తం ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. ప్రమాదానికిగల కారణాలు తెలియాల్సి ఉంది.
#WATCH | Uttarakhand: Despite the snowfall and bad weather, the operation by NDRF, SDRF and police officials is underway at the site of the helicopter crash in Phata of Kedarnath.
Seven people have died in the chopper crash. pic.twitter.com/j4WA8ClJTR
— ANI (@ANI) October 18, 2022