న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్లో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. దాంతో కొండ ప్రాంతాలు బాగా నానిపోయి ఉండి తరచూ రహదారులపై కొండ చరియలు ( Land Slides ) విరిగిపడుతున్నాయి. దాంతో పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తాజాగా నైనిటాల్ పట్టణ పరిధిలో కూడా అలాంటి ఘటనే జరిగింది. ఓ బస్సు 14 మంది ప్రయాణికులతో కొండ ప్రాంతం గుండా వెళ్తుండగా ఒక్కసారిగా దానిముందు కొండ చరియలు విగిపడ్డాయి.
దాంతో ఆ బస్సులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. డ్రైవర్ బస్సును రివర్స్ తీస్తున్నా కూడా కొంతమంది భయంతో బస్సు దిగి పరుగులు తీశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి అపాయం జరుగలేదు. కొండచరియలు విరిగిపడుతున్న దృశ్యాలను ఈ కింది వీడియోలో మీరు కూడా వీక్షించవచ్చు.