Gajendra shekhawat : లోక్సభ తొలి విడత ఎన్నికల నామినేషన్ల గడువు ముగియగానే ఈ నెల 28న రెండో విడత నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. మొత్తం 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రెండో విడత లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో రాజస్థాన్లోని జోధ్పూర్ లోక్సభ స్థానంలో కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నామినేషన్ వేశారు.
శనివారం మధ్యాహ్నం తన సన్నిహితులు, అనుచరులతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లిన గజేంద్రసింగ్ షెకావత్.. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. కాగా, లోక్సభ రెండో విడత ఎన్నికలు ఏప్రిల్ 26న జరగనున్నాయి. ఫలితాలను జూన్ 4న వెల్లడించనున్నారు.
#WATCH | Union Minister Gajendra Singh Shekhawat files nomination from Jodhpur Lok Sabha seat in Rajasthan pic.twitter.com/gkI1MtfUAJ
— ANI (@ANI) March 30, 2024