గువాహటి: శీతాకాలం వచ్చిందంటే చాలు అసోంలోని కజిరంగా నేషనల్ పార్కులో వలస పక్షుల కోలాహలం మొదలవుతుంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చే రకరకాల పక్షులు ఇక్కడ సందడి చేస్తాయి. అక్కడికి వచ్చే పర్యాటకులకు కనువిందు చేస్తాయి. ఈసారి గతం కంటే కొంచెం ముందే కజిరంగాలో వలస పక్షలు సందడి మొదలైంది.
అయితే, ప్రతి ఏడాది నవంబర్లో వలస పక్షుల రాక మొదలయ్యేదని, కానీ ఈ ఏడాది మాత్రం ఇప్పటికే వలస పక్షులు ఇక్కడికి చేరుకుంటున్నాయని కజిరంగా నేషనల్ పార్క్ రిసెర్చ్ ఆఫీసర్ రవీంద్ర శర్మ చెప్పారు. పార్కులోని బురాపహర్, బగోరి, అగోరటోలి ఏరియాల్లో ఈ వలస పక్షులు ఎక్కువగా కనిపిస్తున్నాయని ఆయన తెలిపారు.
#WATCH | Thousands of migratory birds arrive early at Kaziranga National Park in Assam this year pic.twitter.com/Emgz0Wz6Qm
— ANI (@ANI) October 23, 2022