కోల్కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధనకర్పై విమర్శల వర్షం కురిపించారు. గవర్నర్ ఒక అవినీతిపరుడని జగదీప్ ధన్కర్ను ఉద్దేశించి తీవ్ర ఆరోపణలు చేశారు. 1996 నాటి హవాలా జైన్ కేసులో ధన్కర్పై చార్జిషీట్ దాఖలైందని మమతా బెనర్జి వెల్లడించారు. ఇప్పటికీ ఆ కేసు పెండింగ్లోనే ఉన్నదని ఆమె మీడియా సమావేశంలో చెప్పారు.
‘గవర్నర్ ఒక అవినీతి మనిషి. 1996 నాటి హవాలా జైన్ కేసులో గవర్నర్పై చార్జిషీట్ దాఖలైంది. ఈ కేసులో దర్యాప్తుపై ధన్కర్ స్టే తెచ్చుకున్నారు. ఇప్పటికీ అయనపై కేసు పెండింగ్లో ఉన్నది. ఈ కేసు వెలుగుచూసిన సమయంలో జర్నలిస్టుగా విధులు నిర్వహించిన ఓ వ్యక్తి నాకు సంబంధిత డాక్యుమెంట్లను పంపించాడు’ అని మమతా బెనర్జి విలేకరుల సమావేశంలో చెప్పారు.