షిమ్లా: హిమాచల్ ప్రదేశ్లో సీఎం పదవి కోసం గట్టి పోటీ నెలకొన్నది. ముందుగా పలువురి పేర్లు వినిపించినప్పటికీ, ఈ ఉదయానికి హిమాచల్ పీసీసీ చీఫ్ ప్రతిభాసింగ్, పీసీసీ మాజీ చీఫ్ సుఖ్విందర్ సింగ్ సుఖు, సీఎల్పీ మాజీ నేత అగ్నిహోత్రి పేర్లు మాత్రమే వినికిడిలో ఉన్నాయి. ఆఖరికి సుఖ్విందర్ సింగ్ పేరునే కాంగ్రెస్ హైకమాండ్ సీఎంగా ఖరారు చేసిందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు షిమ్లాలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సీఎల్పీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ఇతర నేతలతో మాట్లాడి సుఖ్విందర్ పేరును అధికారికంగా ప్రకటిస్తారని ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో లోపల సీఎల్పీ సమావేశం జరుగుతుండగానే బయట ప్రతిభా సింగ్ మద్దతుదారులు ఆమెకు అనుకూలంగా నినాదాలు చేస్తున్నారు.
ప్రతిభాసింగ్తోపాటు పార్టీ అగ్రనాయకులకు జిందాబాద్లు కొడుతున్నారు. దాంతో హైకమాండ్ సుఖ్విందర్ పేరునే సీఎంగా ప్రకటిస్తే ప్రతిభాసింగ్ మద్దతుదారులు స్పందన ఎలా ఉంటుందనేది చర్చనీయాంశంగా మారింది.
#WATCH | Supporters of Himachal Pradesh Congress president Pratibha Virbhadra Singh raise slogans in Shimla pic.twitter.com/zfeh5vODwp
— ANI (@ANI) December 10, 2022