Mulayam Blessings: ఇవాళ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. ఉదయం 11 గంటలకు పార్లమెంట్ ఉభయసభలు కొలువుదీరాయి. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగించారు. అయితే సభల ప్రారంభానికి ముందు పార్లమెంట్లో సభ్యులు పార్టీలకు అతీతంగా పలకరించుకున్నారు. చాలా రోజుల తర్వాత సభలో కలుసుకోవడంతో ఒకరినొకరు విష్ చేసుకుని పరస్పరం యోగక్షేమాలు తెలుసుకుంటున్న దృశ్యాలు కనిపించాయి.
ఈ సందర్భంగానే కేంద్రమంత్రి స్మృతి ఇరానీ రాజకీయ కురువృద్ధుడు, సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు అయిన ములాయంసింగ్ యాదవ్ను పలకరించి నమస్కారం చేశారు. దాంతో ఆయన ఆమెను దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను సెల్ఫోన్లో వీడియో తీసి ట్విట్టర్లో పెట్టారు. కింది వీడియోలో మీరు కూడా ఆ దృశ్యాలను చూడవచ్చు.