PM Modi: మొజాంబిక్ అధ్యక్షుడు ఫిలిప్ జసింటో నుయిషీతో ప్రధాని నరేంద్రమోదీ భేటీ అయ్యారు. గుజరాత్లోని గాంధీనగర్లో ఈ భేటీ జరిగింది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలతోపాటు తదితర అంశాలపై వారు చర్చించారు. గాంధీనగర్లో జరుగుతున్న వైబ్రాంబ్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ (#VibrantGujaratGlobalSummit) లో పాల్గొనేందుకు మొజాంబిక్ అధ్యక్షుడు మంగళవారం ఉదయం గుజరాత్కు వచ్చాడు.
బుధవారం నుంచి శుక్రవారం వరకు మూడు రోజులపాటు ఈ వైబ్రాంట్ గుజరాత్ గ్లోబల్ సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు మొజాంబిక్ అధ్యక్షుడు ఫిలిప్ను అతిథిగా ఆహ్వానించారు. సౌదీ అరేబియా అధ్యక్షుడు కూడా సదస్సు కోసం ఇవాళ భారత్కు రానున్నారు. ఈ వైబ్రాంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్కు వివిధ దేశాల్లోని పలు కంపెనీల సీఈవోలు హాజరుకానున్నారు.