PM Modi: మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్రమోదీ దేశ రాజధాని ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో గోవులకు పశుగ్రాసం తినిపించారు. పుంగనూరు జాతికి చెందిన కురచ ఆవులకు తన స్వహస్తాలతో పచ్చగడ్డి తినబెట్టారు. ఆ తర్వాత నవ ధాన్యాలను కూడా గోవులకు తినిపించారు.
ఆదేవిధంగా తన ఇంటి ఆవరణలో ఆహ్లాదకరంగా ఉన్న గార్డెన్లో ఆ గోవులతో కాసేపు గడిపారు. ఈ సందర్భంగా ప్రధాని వాటి ఒంటిని అప్యాయంగా నిమిరారు. ప్రధాని తన నివాసంలో గోవులతో గడిపిన దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా వీక్షించవచ్చు..
#WATCH | Delhi | Prime Minister Narendra Modi feeds cows at his residence, on the occasion of #MakarSankranti pic.twitter.com/ghfXlYFRqV
— ANI (@ANI) January 14, 2024